Excise Police | భారీగా నిషేధిత డ్రగ్స్​ పట్టివేత
Excise Police | భారీగా నిషేధిత డ్రగ్స్​ పట్టివేత
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: Excise Police | అక్రమంగా రవాణా చేస్తున్న 250 గ్రాముల నిషేధిత డ్రగ్స్​(అల్ప్రాజోలం)ను ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్ప్రాజోలం తరలిస్తున్నట్లుగా సమాచారం రావడంతో ఎక్సైజ్​ పోలీసులు దాడి చేసి.. కామారెడ్డికి చెందిన మధుసూదన్ చారి, తాండూరు మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన భూమా విఠల్ గౌడ్, గుండారం వెంకగౌడ్​ను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన సురేశ్​ గౌడ్ వద్ద అల్ప్రాజోలం కొనుగోలు చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ముగ్గురితో పాటు విక్రయదారుడు సురేశ్​ గౌడ్​పై కూడా కేసు నమోదు చేశామని, ఓ బైక్​ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో సీఐ స్వప్న, ఎస్సైలు రాంకుమార్, విక్రమ్ కుమార్, సిబ్బంది హమీద్, విష్ణు, అవినాష్, శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Kamareddy | మూడు కోట్ల పెండింగ్ కేసులు.. 250 ఏళ్ల సమయం