Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్:TTD| తిరుమలలో భక్తులకు ఇచ్చే గదుల కేటాయింపుల్లో కీలక మార్పులు జ‌రిగాయి. దర్శన టికెట్ కలిగిన వీఐపీ భక్తులకు మాత్రమే వసతి కేటాయిస్తోంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన చేసింది.

తిరుమలలో మొత్తం 7,500 గదులు ఉండగా.. సీఆర్వో పరిధిలో 3,500 గదులను కరెంట్ బుకింగ్ కింద ఆధార్ కార్డుపై సామాన్య భక్తులకు జారీ చేస్తోంది. 1,580 గదులు అడ్వాన్స్ బుకింగ్ కు, 400 గదులు దాతలకు కేటాయిస్తోంది. 450 గదులను అప్పుడే వ‌చ్చిన వారికి.. మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ కింద వీఐపీలకు జారీచేస్తోంది.

వీటిని శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లల్ పొందాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్‌కార్డుతో పాటు దర్శన టికెట్‌ను తప్పనిసరి చేసింది.

TTD|గ‌తంలో ద‌ళారుల‌దే రాజ్యం..

గతంలో వీఐపీ గదులను ఆధార్‌ కార్డుతో దళారులు పెద్దఎత్తున తీసుకుని వారి ఆధీనంలో ఉంచుకునేవారు. 48 గంటల వరకు వాటిని వినియోగించే వీలుండటంతో ఇద్దరు, ముగ్గురు భక్తులకు ఇచ్చేవారు. ప్రస్తుతం దర్శన టికెట్ ఉన్నవారికే వసతి కల్పిస్తుండటంతో దర్శనానంతరం ఖాళీ చేస్తున్నారు. దీంతో వాటిని మరో అరగంటలోపే ఇతరులకు కేటాయించే అవకాశం లభిస్తోంది. దీనివల్ల ఆదాయం సైతం పెరిగింది.

Advertisement