అక్షరటుడే, వెబ్డెస్క్: Char Dham Yatra : హిందువుల అత్యంత, అత్యున్నత పవిత్రమైన ఆధ్యాత్మి యాత్రలలో ఒకటి చార్ ధామ్ యాత్ర. ఈ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాఖండ్ లోని హిమాలయ పర్వతాల్లో(Himalayan mountains)ని గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్(Gangotri, Yamunotri, Kedarnath, Badrinath) ఆలయాల సందర్శనకు చేపట్టేదే ఈ చార్ధామ్ యాత్ర.
చార్ధామ్ యాత్రను ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు. మోక్ష ప్రదాయినిగా కూడా భక్తులు నమ్ముతారు. ఏటా లక్షల్లో భక్తులు ఈ యాత్ర కొనసాగిస్తారు. 2024లో ఈ చార్ధామ్ యాత్రలో 30 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఈ నెల (ఏప్రిల్) 30న యాత్ర ప్రారంభం కానుంది. చార్ధామ్ యాత్రలో పాల్గొనాలంటే ఆన్లైన్(online), ఆఫ్లైన్(offline)లో రిజిస్ట్రేషన్(register) చేసుకోవాలి.
ఆన్లైన్ అనుకుంటే.. అధికారిక వెబ్సైట్ లో వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం ఈమెయిల్, మొబైల్ నంబరు, ఆధార్, పాన్, ఓటర్ ఐడీ(email, mobile number, Aadhaar, PAN, voter ID) అప్లోడ్ చేయాలి. తాజా పాస్పోర్టు సైజు ఫొటో కచ్చితంగా అవసరం. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఈ-పాస్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ కావాలంటే.. డెహ్రాడూన్, హరిద్వార్, గుప్తకాశి, సోనయాగ్ కేంద్రాల(Dehradun, Haridwar, Guptkashi, Soniyag centers)లో నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అక్కడ అవసరమైన ధ్రువపత్రాలు, మెడికల్ సర్టిఫికేట్స్, ఫొటో సమర్పించాలి.