అక్షరటుడే, వెబ్డెస్క్: DIL RAJU : సినిమా రంగానికి పైరసీ పెనుభూతంగా మారిందని.. దీనిని అరికట్టాలంటే ఓ ఉద్యమమే రావాలని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో పైరసీ కారణంగా నిర్మాణ రంగం కుదేలైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రూ.వందల కోట్లలో పెట్టుబడులు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు పైరసీ కారణంగా నష్టాలపాలై నడిరోడ్డుపై నిలబడుతున్నారన్నారు.
DIL RAJU : నిర్మాతలంతా కలిసి రావాలి
పైరసీని కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని నిర్మాతలంతా ఏకతాటిపైకి రావాలని దిల్రాజు స్పష్టం చేశారు. అయితే పైరసీ అడ్డుకట్టకు మార్గం సుగమమవుతుందన్నారు. దీనికి సంబంధించి ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రూ.కోట్లలో పెట్టిన పెట్టుబడులు పైరసీ కారణంగా బూడిదలో పోసినట్లవుతుందని.. నిర్మాతలంతా కలిసి రావాలని దిల్రాజు పిలుపునిచ్చారు.
DIL RAJU : ఎఫ్డీసీ ఛైర్మన్గా లీడ్చేస్తా..
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా విడుదల కాగానే రెండు మూడు రోజుల్లోనే పైరసీ వచ్చేస్తోందని.. దీని వెనక పెద్ద మాఫియానే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. నిర్మాతలంతా ముందుకొస్తే.. తాను లీడ్ చేస్తానని ఆయన పేర్కొన్నారు.