అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలంలోని నల్లమడుగు ప్రాంతంలో మంగళవారం పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. లింగంపల్లి, నల్లమడుగు అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో తనిఖీలు జరిపారు. రూ.37 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement