Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగర శివారులోని అలీసాగర్ ప్రాజెక్ట్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం స్థానిక బెరుకు గుట్ట వద్ద చిరుత కనిపించదని సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు బుధవారం పాదముద్రలు సేకరించారు. ఈ ముద్రలు చిరుతవేనా కావా అని తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే గతంలోనూ ఈ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు ఆధారాలున్నాయని.. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ప్రతాప్, ప్రవీణ్లు పేర్కొన్నారు.
Advertisement