అక్షరటుడే, వెబ్​డెస్క్​: ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంగళవారం కలిశారు. వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. కమిషన్​ ఎస్సీలను 1, 2, 3 గ్రూప్​లుగా విభజించాలని పేర్కొందని, అలా కాకుండా ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేపట్టాలని కోరారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  SLBC | ఎస్​ఎల్​బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు