అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రంలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. మల్టీజోన్–1(multi zone-1) పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లను(ci transfers) బదిలీ చేశారు. ఈ మేరకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి(IG Chandra Shekhar Reddy) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వీరిలో ఎక్కువ మంది ఐజీ కార్యాలయంలో వెయిటింగ్, లూప్లైన్ పోస్టింగులో వారే ఉన్నారు. అలాగే చెన్నూర్ ఎస్హెచ్వో రవీందర్ పై బదిలీ వేటు వేశారు. నిర్మల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా మున్నూరు కృష్ణను నియమించారు. అతి త్వరలో మరికొంత మంది సీఐలు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల పలు జిల్లాలకు కొత్త పోలీస్ బాస్లను నియమించిన నేపథ్యంలో వారిచ్చే నివేదిక ఆధారంగా ప్రస్తుతం వివిధ సర్కిల్ పోస్టింగుల్లో కొనసాగుతున్న వారిపై బదిలీ వేటు వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.