అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ముఖ్య నేతలు ఎంఐఎం గూటికి చేరారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్‌ మీర్‌ మజాజ్‌ అలీఖాన్‌, నిజామాబాద్‌ వక్ఫ్‌బోర్డు మాజీ ఛైర్మన్‌ ఫయాజ్‌, 57వ డివిజన్‌ ఇన్‌ఛార్జి అమర్‌లు ఎంఐఎం కండువా కప్పుకున్నారు. సోమవారం పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కాగా.. నగరంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అసద్‌ వారికి సూచించారు.