Advertisement

అక్షరటుడే, ఇందూరు: జీజీహెచ్ ఆవరణలో నిర్మించిన మాత శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ భవనాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, ధన్‌ పాల్‌ సూర్యనారాయణ గుప్తా, నూడా ఛైర్మన్‌ కేశ వేణు, సహకార యూనియన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, మేయర్‌ నీతూ కిరణ్‌, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Advertisement