Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: MLA quota : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఈ నెల 29న పది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన చేపడతారు. 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 20న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.

MLA quota : తెలంగాణలో ఐదు స్థానాలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ఐదు స్థానాలను భర్తీ చేయనున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం.. కాంగ్రెస్​ నాలుగు, బీఆర్​ఎస్​ ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే 21 మంది ఎమ్మెల్యేలు అవసరం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ 39 స్థానాలు గెలుచుకుంది. అనంతరం కంటోన్మెంట్​ ఎమ్మెల్యే చనిపోవడంతో ఉప ఎన్నికల్లో ఆ స్థానంలో కాంగ్రెస్​ విజయం సాధించింది.

బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన పది మంది కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆ పార్టీ బలం 28కి చేరింది. ఈ లెక్కన ఒక్క స్థానం గెలిచే అవకాశం ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Ration Cards : రేష‌న్ కార్డుల పంపిణీపై కీల‌క అప్‌డేట్.. స్మార్ట్ కార్డుల జారీకి సన్నాహాలు..!

MLA quota : వారి ఓటు ఎటో..

బీఆర్​ఎస్​ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరారు. వీరి అనర్హత పిటిషన్​ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉంది. దీంతో వీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

MLA quota : ఖరారు కాని అభ్యర్థులు

నోటిఫికేషన్​ వెలువడిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీలు ఇంకా ప్రకటించలేదు. అధికార కాంగ్రెస్​ పార్టీ నుంచి చాలా మంది టికెట్​ ఆశిస్తున్నారు. మెదక్​ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధుకు టికెట్​ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

అలాగే జగ్గారెడ్డి కూడా కుసుమ కుమార్ కు​ టికెట్​ ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. దీంతో పాటు పలువురు సీనియర్​ నాయకులు సైతం టికెట్​ దక్కించుకోవడానికి తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

వారి మద్దతు ఎవరికో..

బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, మజ్లిస్​కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరు సొంతంగా పోటీ చేసే అవకాశం లేదు. దీంతో వీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement