అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajasingh | బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆయనపై విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘించారని గతంలో మూడు కేసులు నమోదు అయ్యాయి. వీటిని విచారించిన నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు రాజా సింగ్ను నిర్దోషిగా ప్రకటించింది.
Rajasingh | బీఆర్ఎస్ హయాంలో పీడీ యాక్ట్
బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదైంది. హైదరాబాద్లో స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ షో సందర్భంగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే అప్పుడు ఆ కేసులో ఆయనను అరెస్టు చేసినా కోర్టు రిమాండ్ ఇవ్వలేదు. దీంతో పోలీసులు గతంలో నమోదైన కేసుల ఆధారంగా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపారు. తాజాగా ఆ కేసుల్లో ఆయనను కోర్టు నిర్దోషిగా తేల్చింది.