అక్షరటుడే, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె జగిత్యాలలో మాట్లాడారు. కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని ఎద్దేవా చేశారు. ఓట్లు వేయించుకున్న తర్వాత రేవంత్రెడ్డి బీసీలను మోసం చేశారన్నారు. బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదన్నారు. రాష్ట్రంలో 52 శాతం బీసీలు ఉన్నారని కేసీఆర్ 2014లోనే చెప్పారని, ప్రస్తుత సీఎం మాత్రం లెక్క తగ్గించి చెబుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం జలాలు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్లో చేరారని విమర్శించారు.
Advertisement
Advertisement