Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: జనగణన ఇంకెప్పుడు చేస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. జనగణనను కేంద్ర ప్రభుత్వం కావాలనే విస్మరిస్తోందని ఆరోపించారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందన్నారు. జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement