Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: నీళ్ల విషయంలో సీఎం రేవంత్​రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్​లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు – నిజాలు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్​ టేబుల్​ సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్​ ప్రారంభించిన ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. కేసీఆర్​ను శత్రువు అనుకుంటున్న రేవంత్​రెడ్డి.. మన జలాలను తరలిస్తున్న ఆంధ్ర పాలకులు శత్రువులనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. కృష్ణ ట్రిబ్యునల్​లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలని సూచించారు. బీఆర్​ఎస్​ హయాంలో నీటి వనరుల అభివృద్ధే ధ్యేయంగా పని చేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం జలవనరులను విస్మరిస్తోందని ఆమె విమర్శించారు. బీఆర్​ఎస్ పాలనలో చేపట్టిన చర్యలతో నేడు వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానానికి చేరిందని ఆమె పేర్కొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  MLC KAVITHA | ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు