అక్షరటుడే, వెబ్డెస్క్ : AICC | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏదో ఒక రోజు దేశాన్ని అమ్మేస్తారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
AICC | మహారాష్ట్ర ఎన్నికలు పెద్ద మోసం
ఎన్నికల సంస్థలు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని ఖర్గే ఆరోపించారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లు తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికలు పెద్ద మోసం అని ఆయన ఆరోపించారు. నిజాలు ఏదో ఒక రోజు బయట పడతాయన్నారు.