PM Modi | ఆ దేశాల్లో పర్యటించనున్న మోదీ

PM Modi | ఆ దేశాల్లో పర్యటించనున్న మోదీ
PM Modi | ఆ దేశాల్లో పర్యటించనున్న మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) వచ్చే నెలలో రెండు దేశాల్లో పర్యటించనున్నారు. థాయ్‌లాండ్‌(Thailand), శ్రీలంక (Sri lanka) దేశాల్లో ఆయన పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఏప్రిల్‌ 3-4 తేదీల్లో థాయ్‌లాండ్‌లో జరగనున్న బిమ్‌స్టెక్‌(BIMSTEC) కూటమి సమావేశంలో మోదీ పాల్గొనన్నారు.

Advertisement
Advertisement

ఆయా దేశాల మధ్య పలు అంశాల్లో సహకారం, వాణిజ్యం తదితర విషయాలపై చర్చించనున్నారు. అనంతరం అక్కడి నుంచి మోదీ ఏప్రిల్​ 4న శ్రీలంక(Srilanka)కు బయలు దేరుతారు. ఆ దేశాధ్యక్షుడు దిసనాయకే  (Dissanayake) తో మోదీ భేటీ కానున్నారు. అక్కడి పలువురు రాజకీయ నేతలతో కూడా మోదీ సమావేశమవుతారు. భారత్​, శ్రీలంక సంయుక్తంగా నిర్మించిన సంపూర్​(Sampoor) సోలార్​ పవర్​ స్టేష్​న్​ను ఆయన ప్రారంభిస్తారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Earthquake | భారీ విషాదం మిగిల్చిన భూకంపం

శ్రీలంక పర్యటన ముగించుకొని ప్రధాని నేరుగా తమిళనాడులోని రామేశ్వరం(Rameswaram) చేరుకుంటారు. అక్కడ రామనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్టాత్మక పంబన్​ వంతెనను(Pamban Bridge) ప్రధాని ప్రారంభించనున్నారు.

Advertisement