అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | జీడిమెట్ల jeedimetla police పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది.
గాజులరామారం Gajularamaramలో నివాసం ఉండే తేజస్విని రెడ్డికి కుమారులు హర్షిత్రెడ్డి(7), ఆశిష్రెడ్డి(5) ఉన్నారు. కుటుంబ కలహాలతో ఆమె తన ఇద్దరు కుమారులను వేటకొడవలితో నరికి చంపింది. అనంతరం ఆమె కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆరు పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.