Telangana MLC | ప్రమాణస్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు

Telangana MLC | ప్రమాణస్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు
Telangana MLC | ప్రమాణస్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana MLC | తెలంగాణ శాసనమండలి(Legislative Council)కి ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ(MLC)లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా శ్రీపాల్​రెడ్డి, కొమురయ్య ఎన్నికైన విషయం తెలిసిందే. వీరితో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్​, శంకర్​ నాయక్​, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్​ ఎన్నికయ్యారు. దాసోజ్​ శ్రవణ్​ మినహా మిగతా ఏడుగురితో  మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Polavaram Project Authority | పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం..పలు కీలక నిర్ణయాలు