అక్షరటుడే, జుక్కల్ : మహమ్మద్ నగర్ మండల వ్యవసాయ అధికారిగా నూతనంగా వచ్చిన నవ్య సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. మండలంలోని గిర్ని తండా, నడిమి తండా, కోన తండా గ్రామాల్లో ఆమె పర్యటించారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం తూకాలు కొనసాగించాలని నిర్వాహకులకు సూచించారు. ఏఈవో రేణుక, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి సరిచేంద్, సంతోష్, రాములు నాయక్, గన్యా నాయక్ ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement