అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : దొంగతనాల నివారణకు బంగారం దుకాణాల్లో కొత్త రకం అలారం పెట్టుకోవాలని నిజామాబాద్​ ఏసీపీ రాజావెంకట​రెడ్డి సూచించారు. జిల్లాలో చోరీలు పెరుగుతుండడంతో బంగారు వర్తక వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలోని మార్వాడీగల్లీ స్వర్ణ భవన్​లో గోల్డ్​, సిల్వర్​ మర్చంట్​ అసోసియేషన్​ సభ్యులకు ఆయన అవగాహన కల్పించారు. బంగారం దుకాణాల్లో పెట్టుకోవడానికి అందుబాటు ధరలో అలారం ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి షాప్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి పూట వాచ్​మన్​ను పెట్టుకోవాలని ఆయన సూచించారు. వన్ టౌన్ సీఐ రఘుపతి, అసోసియేషన్ అధ్యక్షుడు పాల్దే లక్ష్మీకాంతం, పసుల రాజ్ కుమార్ పాల్గొన్నారు.