అక్షరటుడే, బాన్సువాడ: అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బాన్సువాడ మండలంలో మంగళవారం ఒక్కరోజే 8,100 కోళ్లు మరణించాయి. బోర్లం క్యాంప్ గ్రామంలోని కోళ్ల ఫారంలో కళ్ల ఎదుటే కోళ్లు చనిపోతుండడంతో యజమాని బోడ రామచందర్ కన్నీటిపర్యంతమయ్యాడు. వైరస్ సోకడంతోనే కోళ్లు మృతిచెందుతున్నాయని యజమాని వాపోయాడు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
Advertisement
Advertisement