Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: ట్రైన్ డోర్లు ఓపెన్ చేయకపోవడంతో ప్రయాణికులు అద్దాలు పగులగొట్టిన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్లన్నీ నిండిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బీహార్లోని మదుబని స్టేషన్కు వచ్చిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ ట్రెయిన్లో కూడా స్థలం లేకపోవడంతో అధికారులు డోర్లు ఓపెన్ చేయలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఏసీ కోచ్ అద్దాలు పగులకొట్టి లోనికి వెళ్లడానికి ప్రయత్నించారు.
Advertisement