అక్షరుటుడే, ఇందూరు: జిల్లా గాండ్ల సంఘం క్యాలెండర్లను పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ హైదరాబాద్​లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం కమ్యూనిటీ హాల్​ కోసం ఎకరం స్థలం కేటాయించాలని పీసీసీ చీఫ్​ను వారు కోరారు. అనంతరం మహేశ్​కుమార్​గౌడ్​ను సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సాయన్న, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు నాగరాజు, క్యాషియర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Alfazolam | అల్ఫాజోలం పట్టివేత