అక్షరటుడే, భిక్కనూరు: electric pole : కుటుంబ కలహాలతో విరక్తి చెందిన ఓ వ్యక్తి ఏకంగా స్తంభానికే ఉరేసుకుని electric pole తనువు చాలించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో Kamareddy diatrict crime చోటు చేసుకుంది.
భిక్కనూరు మండలం bhikkanoor mandal పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన నరసింహులు(45) కుటుంబ సభ్యుల మధ్య గత కొద్ది రోజులుగా గొడవ జరుగుతున్నట్లు చెప్పారు. దీంతో జీవితంపై విరక్తి చెంది తన ఇంటి వద్ద ఉన్న విద్యుత్తు స్తంభానికి ఉరేసుకొని మృతి చెందాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.