Maoist | గుట్ట చుట్టూ బాంబులు పెట్టాం.. మావోయిస్టుల సంచలన లేఖ

Maoist | గుట్ట చుట్టూ బాంబులు పెట్టాం.. మావోయిస్టుల సంచలన లేఖ
Maoist | గుట్ట చుట్టూ బాంబులు పెట్టాం.. మావోయిస్టుల సంచలన లేఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist | గుట్ట చుట్టూ బాంబులు పెట్టామని, ప్రజలు అటువైపు రావొద్దని మావోయిస్టులు రాసిన లేఖ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ములుగు(Mulugu) జిల్లా వాజేడు – వెంకటాపురం ఏరియా కమిటీ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆపరేషన్​ కగార్(Opearation Kagar)​ పేరుతో కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్​కౌంటర్లు(Encounters) చేస్తుందని ఆరోపించారు. ఈ ఎన్​కౌంటర్లతో మావోయిస్టులతో పాటు అనేక మంది అమాయక గిరిజనులు చనిపోతున్నారని పేర్కొన్నారు.

Advertisement

ఆపరేషన్​ కగార్​ నుంచి తమను రక్షించుకోవడానికి వెంకటాపురం మండలం కర్రిగుట్ట చుట్టూ బాంబులు పెట్టినట్లు వారు లేఖలో పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని కోరారు. డబ్బులు ఆశచూపి, మాయ మాటలు చెప్పి ప్రజలను పోలీసులు ఇన్​ఫార్మర్లుగా మార్చుకుంటున్నారని ఆ లేఖలో ఆరోపించారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్​ పాలనపై కూడా లేఖలో విమర్శించారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

Advertisement