Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫ్రాన్స్లో ఘన స్వాగతం లభించింది. ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మాక్రాన్ ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించి ఓ వీడియోను ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఆయన అక్కడ జరిగే ఏఐ సదస్సులో పాల్గొంటారు. అనంతరం అమెరికా పర్యటనకు బయలుదేరుతారు.
Advertisement