Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించనున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్​ ట్రంప్​తో ఆయన భేటీ కానున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ స్వయంగా వెల్లడించారు. మోదీ ట్రంప్​తో సోమవారం ఫోన్​లో మాట్లాడారు. ఇరుదేశాల సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు ట్రంప్​ తెలిపారు. ఈ సందర్భంగా మోదీని వైట్​ హౌస్​కు ఆహ్వానించానని ఆయన పేర్కొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  America | అమెరికాలో మరో తెలుగు యువకుడిపై కాల్పులు