అక్షరటుడే, హైదరాబాద్: Detained women : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో దారుణం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఘోర అవమానం జరిగింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యులను రప్పించారు.
కాగా, మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలు బయటకు వెళ్లకుండా గేటుకు తాళాలు వేశారు. అత్యవసర పరిస్థితి ఉందని, గేటు తెరవండని వేడుకున్నా కనికరించలేదు. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారని కొందరు మహిళలు ప్రాధేయపడినా పోలీసులు పట్టించుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ముగిస్తేనే బయటకు పంపిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ముగిస్తేనే పంపిస్తాం
పరేడ్ గ్రౌండ్లో మహిళల గేట్ తాళాలు వేసి నిర్బంధించిన పోలీసులు
యూజ్ లెస్ ఫెల్లోస్ అంటూ మహిళల ఆగ్రహం
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పోలీసుల ఓవరాక్షన్
ముఖ్యమంత్రి ప్రసంగం ముగిసే వరకు బయటికి వదలం అంటూ గేట్లు మూయడం తో ఇబ్బంది.
ఇదేం… pic.twitter.com/cCTGFOz7U4
— Telugu Scribe (@TeluguScribe) March 8, 2025