అక్షరటుడే, బాన్సువాడ: adulterated toffee : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి, అంకోల్, బీర్కూరు మండలం దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన విషయం విదితమే. కాగా.. ఈ కల్తీ కల్లు కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు నస్రుల్లాబాద్ ఎస్సై లావణ్య తెలిపారు. కేసులో ఏ1 గా దుర్కి గ్రామానికి చెందిన ఉడతల లక్ష్మా గౌడ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించిన్నట్లు పేర్కొన్నారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు ఎస్సై వివరించారు.
Advertisement
Advertisement