అక్షరటుడే, వెబ్డెస్క్: దేశ ప్రజలకు ఆర్బీఐ గుడ్న్యూస్ చెప్పింది. రెపో రేట్లను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర వెల్లడించారు. దీంతో ప్రస్తుతం రెపో రేటు 6.25 శాతానికి చేరుకుంది. కాగా ఐదేళ్ల తర్వాత ఆర్బీఐ రెపోరేటు తగ్గించడం గమనార్హం. తాజా తగ్గింపుతో ప్రజలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. మరోవైపు కొంత కాలంగా అధికంగా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు కూడా దిగిరానున్నాయి.
Advertisement
Advertisement