KTR | చెరువును తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి: కేటీఆర్​

KTR | చెరువును తాకట్టు పెట్టిన రేవంతరెడ్డి : కేటీఆర్​
KTR | చెరువును తాకట్టు పెట్టిన రేవంతరెడ్డి : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | రేవంత్​రెడ్డి ప్రభుత్వం Revanth Reddy government కంచ గచ్చిబౌలి భూముల్లోని Kancha Gachibowli lands చెరువును కూడా తాకట్టు పెట్టి రుణం తీసుకుందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన హెచ్​సీయూ భూముల HCU lands విషయమై మీడియాతో మాట్లాడారు.

Advertisement

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల విషయంలో రూ.10 వేల కోట్ల స్కామ్​ జరిగిందని తాను చెప్పిందే నిజమైందన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన సెంట్రల్​ ఎంపవర్​మెంట్​ కమిటీ Central Empowerment Committee కూడా ఇక్కడ జరిగిన అక్రమాలు, ఆర్థికపరమైన అవకతవకలపై విచారణ జరపాలని బుధవారం నివేదిక ఇచ్చిందన్నారు. దీనిపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఇండిపెండెంట్ ఇన్విస్టిగేషన్ టీంను independent investigation team ఏర్పాటు చేయాలని సూచించిందని కేటీఆర్​ తెలిపారు. ఈ కుంభకోణం బయటకు రావాలంటే ఆర్బీఐ RBI కూడా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  PCC Chief Bomma Mahesh Kumar | కేటీఆర్ అరెస్టు తప్పదు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు

KTR | విచారణకు ఆదేశించాలి

హెచ్​సీయూ భూముల వ్యవహారంలో ప్రధాని మోదీ Prime Minister Modi విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని కేటీఆర్​ KTR ప్రశ్నించారు. ఈ భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని హర్యానాలో Haryana మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్​ స్పందిస్తూ.. విధ్వంసం గురించి మాట్లాడిన మోదీ చర్యలు ఎందుకు చేపట్టడం లేదన్నారు. ప్రధానికి Prime Minister చిత్తశుద్ధి ఉంటే ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్​ చేశారు.

Advertisement