అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరకపోవడంపై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందన్నారు. రవీంద్రభారతిలో జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలను ఆయన బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూల్స్తో ఎందుకు ప్రభుత్వ బడులు పోటీ పడలేకపోతున్నాయని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులకు రూ.40 వేలు ఖర్చు చేస్తున్నామని రేవంత్రెడ్డి తెలిపారు.
CM Revanth | వారి ఉద్యోగాలు తీయడంతోనే..
నిరుద్యోగ సమస్యతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని రేవంత్రెడ్డి అన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీంతో యువత 12 ఏళ్ల వయసు వృథా అయిందన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు తీసేయడంతో ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయన్నారు. వారు స్ట్రేచర్ ఉందని విర్రవీగడంతోనే ప్రజలు వారిని స్ట్రెచర్ మీదకు పంపారన్నారు. ఇంకా అలాగే చేస్తే తర్వాత మార్చురీకి పోతారని వ్యాఖ్యలు చేశారు.