అక్షరటుడే, సిద్దిపేట: అనిశా వలలో రెవెన్యూ చేప చిక్కింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల తహశీల్దార్ కార్యాలయంలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ మన్యం నర్సింహా రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒకరి పేరు మీద ఉన్న పట్టా భూమిని మరొకరి పేరు మీదికి వారసత్వంగా నమోదు చేసేందుకు బాధిత ఫిర్యాదు దారుడి నుంచి రూ.1,00,000/- డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అనిశా అధికారులను సంప్రదించడంతో వల పన్ని పట్టుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  ACB | ఏసీబీకి చిక్కిన మార్కెట్​ కమిటీ సెక్రెటరీ