అక్షరటుడే, వెబ్డెస్క్ : Summer | రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు (Temparature) పెరుగుతున్నాయి. ఉదయం పది గంటలకే ఎండలు మండుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
ఫలితంగా మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. శనివారం ఆసిఫాబాద్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 42.4°డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం గమనార్హం. మార్చి మధ్యలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా మరో ఐదురోజుల పాటు వేడి గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
Summer | పెరిగిన విద్యుత్ వినియోగం
ఎండలు మండుతుండటంతో ప్రజలు ఇళ్లలోనే ఉన్నా ఉక్కపోత(Heat)తో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఏసీలు(AC), కూలర్ల(Cooler) వినియోగం పెరిగి, విద్యుత్ డిమాండ్(Electricity) పెరిగింది. మరోవైపు వరి సాగుకు కూడా ప్రస్తుతం నీరు అధికంగా అవసరం కావడంతో రైతులు నిత్యం మోటార్లు నడిపిస్తున్నారు. ఫలితంగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదు అవుతుంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా గురువారం 16,918 మెగావాట్ల డిమాండ్ నమోదు అయింది. కొద్దిరోజులుగా నిత్యం 16 వేల మెగావాట్లకు పైనే విద్యుత్ డిమాండ్ ఉంటోందని అధికారులు చెబుతున్నారు.