అక్షరటుడే, బాన్సువాడ: Robbers wreak : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ kamareddy district nasrullabad మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. మరో రెండు దుకాణాల్లో చోరీకి యత్నించారు.
ఎస్ఐ లావణ్య తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో మహేందర్ గౌడ్ అనే వ్యక్తి కిరాణా దుకాణంలో దొంగతనం జరిగింది. మోయిన్ ఖాన్ పాన్ షాప్ తాళాలు పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. మరో రెండు కిరాణా దుకాణాల్లో దొంగతనానికి యత్నించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.