అక్షరటుడే, వెబ్డెస్క్ : Betting | బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. వారు అలాంటి పనులు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. అలా చేస్తే మనీలాండరింగ్, చట్టవ్యతిరేక నేరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అప్పుడు వారిపై మరిన్ని కేసులు నమోదు చేయొచ్చని తెలిపారు.
Betting | అన్ఫాలో చేయండి
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిని అన్ఫాలో చేయాలని యువతకు సజ్జనార్ సూచించారు. అభిమానంతో మనల్ని అనుసరించే వారిని మోసం చేయడం సరికాదని ఆయన సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్లకు సూచించారు. బెట్టింగ్ యాప్ల నిర్మూలనకు అందరం కలిసి పోరాటం చేయాలన్నారు. బెట్టింగ్ యాప్లతో ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. డబ్బులు సంపాదించడానికి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం సరికాదన్నారు.
Betting | తల్లిదండ్రులు గమనించాలి
బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిన వారిలో మార్పు వస్తుందని సజ్జనార్ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. స్మార్ట్ఫోన్లలో కొత్తయాప్ డౌన్లోడ్ చేసుకున్నా, బయట అప్పులు చేస్తున్నట్లు తెలిసినా వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు. కష్టపడితేనే డబ్బులు వస్తాయనే విషయాలను పిల్లలకు వివరించాలని చెప్పారు. ఈజీ మనీకి అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయన్నారు.
Betting | ఇద్దరిపై కేసు నమోదు
బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు అయినట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. భయ్యా సన్నీయాదవ్పై నూతన్కల్లో, హర్షసాయిపై హైదరాబాద్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే వారికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో కనుక్కోవాలని ఆయన సూచించారు. అప్పుడే కేసు మూలాలు తెలుస్తాయన్నారు.