అక్షరటుడే, వెబ్డెస్క్ : Railways | రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే దేశంలోని పలు రైల్వే స్టేషన్(Railway Station)లను ఆధునీకరించిన ప్రభుత్వం.. ఆయా స్టేషన్లలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టనుంది. విమానాశ్రయాల(Airports) తరహా సెక్యూరిటీని పలు రైల్వే స్టేషన్లలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Railways | యాక్సెస్ కంట్రోల్ సిస్టం
ప్రస్తుతం టికెట్ ఉన్నా.. లేకున్నా అందరిని ప్లాట్ఫామ్ మీదకు అనుమతిస్తున్నారు. ఇక నుంచి ఎవరు పడితే వారు వెళ్లే అవకాశం ఉండదు. దేశంలోని 60 రైల్వేస్టేషన్లలో యాక్సెస్ కంట్రోల్ సిస్టం(Access control) ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే జనరల్, వెయిటింగ్ టికెట్ ఉన్నవారు స్టేషన్లోకి ప్రవేశించలేరు. టికెట్ కన్ఫర్మ్ అయిన వారికే స్టేషన్లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. రద్దీని నివారించడం, ప్రయాణికుల భద్రతను పెంచడానికి ఈ విధానం తీసుకు వస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం మెట్రో స్టేషన్లలోకి కూడా టికెట్ ఉన్నవారినే అనుమతించే వ్యవస్థ ఉంది.
Railways | ప్రధాన నగరాల్లో..
ప్రస్తుతం యాక్సెస్ కంట్రోల్ సిస్టంను ఢిల్లీ, చైన్నై, ముంబయి, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్లాంటి ప్రధాన నగరాల్లోని 60 స్టేషన్లలో అందుబాటులోకి తీసుకు రానున్నారు. అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఈ విధానం తీసుకు వస్తే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయని రైల్వే శాఖ భావిస్తోంది.