అక్షరటుడే, నిజామాబాద్ సిటీ:Drunk and Drive | నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఏడుగురికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం(nizamabad Court) తీర్పునిచ్చింది.
ట్రాఫిక్ ఏసీపీ నారాయణ(Traffic ACP Narayana) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో తనిఖీలు చేస్తుండగా.. పలువురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారికి కౌన్సెలింగ్(Councelling) నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్(Second Class Magistrate nizamabad) ఎదుట హాజరు పర్చారు. ఏడుగురికి రెండురోజుల చొప్పున జైలు శిక్ష విధించారని.. మరో ఐదుగురికి రూ. 8,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. తనిఖీల్లో ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఎస్ఐ సుమన్, సిబ్బంది పాల్గొన్నారు.