Advertisement

అక్షరటుడే, భిక్కనూరు: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీకి మంత్రి పదవి ఇస్తే జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని దోమకొండ బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్​, భిక్కనూరు మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు బల్యాల రేఖ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మాజీ సీఎం రాజశేఖర్​రెడ్డి హయాంలో షబ్బీర్​ అలీ విద్యుత్​శాఖ మంత్రిగా రాష్ట్రానికి ఎంతో సేవ చేశారన్నారు. ఎంతో అనుభవమున్న ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాన్ని కాంగ్రెస్​ అధిష్టానం పరిశీలించాలని కోరారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Kamareddy | పెట్రోల్​ కాపాడుకునేందుకు చేసిన ఉపాయం భార్య ప్రాణాలనే తీసింది..