అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: అర్ధరాత్రి దుకాణాలు తెరిచిన ముగ్గురికి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహన్ ఒక రోజు జైలు శిక్ష వేసినట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. షేక్ అబు (సవేరా హోటల్, మాలపల్లి), సయ్యద్ సమీర్ (మిలాన్ హోటల్, ఖిల్లా రోడ్డు), మహ్మద్ షాకీర్ హుస్సేన్ (స్నూకర్ బిజినెస్, బోధన్ రోడ్డు)కు జైలు శిక్ష విధించినట్లు వివరించారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపిన మరొకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.