అక్షరటుడే, వెబ్డెస్క్: Recharge Tariffs | యూజర్లకు షాక్ ఇవ్వడానికి టెలికాం telecom కంపెనీలు సిద్ధమయ్యాయి. గతేడాది జూలైలో టారిఫ్లను పెంచిన ఆయా సంస్థలు మళ్లీ రేట్లు పెంచడానికి యత్నిస్తున్నాయి. గతేడాది జూలైలో మొదట జియో(jio) రీఛార్జ్ రేట్లను పెంచింది. అనంతరం ఎయిర్టెల్ Airtel, వీఐ VI కూడా అదే బాటపట్టాయి. దీంతో చాలా మంది యూజర్లు బీఎస్ఎన్ bsnlలోకి పోర్టు అయ్యారు. జియో చాలా మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. రేట్లు తక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వారు బీఎస్ఎన్ఎల్లోకి మారారు.
ఈ ఏడాది కూడా టెలికాం కంపెనీలు రేట్లు పెంచాలని చూస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ పెంపు 10 శాతం నుంచి 20శాతం వరకు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే టెలికాం ధరలు తక్కువగా ఉన్నాయి. మరోవైపు కంపెనీలు వ్యాపారాన్ని నడపాడానికి ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ఈ ఏడాది చివరి వరకు రేట్లు పెంచనున్నట్లు సమాచారం.