అక్షరటుడే, జుక్కల్: పిట్లం మండలం మీదుగా శనివారం తెల్లవారుజామున ప్రభుత్వ అనుమతి లేకుండా తరలిస్తున్న మూడు ఇసుక టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. అనంతరం ఇసుక టిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మండలంలోని మంజీర నది నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement