Kishan Reddy | శంషాబాద్​కు సిగ్నర్​ఫ్రీ రోడ్డు నిర్మించాం
Kishan Reddy | శంషాబాద్​కు సిగ్నర్​ఫ్రీ రోడ్డు నిర్మించాం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kishan Reddy | తెలంగాణలో ఇప్పటివరకు 10 జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.6,280 కోట్లతో 285 కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మించినట్లు తెలిపారు. పార్లమెంట్​ సమావేశాల అనంతరం వీటిని కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ ప్రారంభిస్తారని చెప్పారు.

Kishan Reddy | ఆర్​ఆర్​ఆర్​పై గడ్కరీతో చర్చించాం

హైదరాబాద్​ వెలుపల రీజినల్​ రింగ్​ రోడ్డు(RRR)​ కోసం కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీతో చర్చించామని కిషన్​ రెడ్డితో చర్చించామని తెలిపారు. ఫైనాన్స్‌కు సంబంధించి ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందన్నారు. ఈ రోడ్డు కోసం రూ.18,772 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. అలాగే రూ. 300 కోట్లతో ఆరాంఘర్​ నుంచి శంషాబాద్​ వరకు ఆరులైన్ల హైవే పూర్తయ్యిందని వివరించారు. శంషాబాద్​కు సిగ్నల్​ ఫ్రీ రోడ్డుగా మారుతుందని పేర్కొన్నారు. వచ్చేనెలలో BHEL ఫ్లైఓవర్ పూర్తవుతుందని చెప్పారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Kishan Reddy | పోలీసుల లాఠీఛార్జీని ఖండిస్తూ కిషన్‌రెడ్డి ట్వీట్