అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : శబరిమల వెళ్లే యాత్రికులకు దక్షిణమధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 22, 29 తేదీల్లో మౌలాలి (హైదరాబాద్‌) – కొల్లాం, ఈనెల 24, డిసెంబర్‌ 1న కొల్లాం – మౌలాలి, నవంబర్‌ 18,25 తేదీల్లో మచిలిపట్నం – కొల్లాం, నవంబర్‌ 20,27 తేదీల్లో కొల్లాం – మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MMTS expansion | ఆ ప్రాంతాల వారికి శుభవార్త..MMTS విస్తరణకు కేంద్రం ఆమోదం!