Advertisement
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాలు, రికార్డు గదులు పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు సంబంధించి అధికారులు, సిబ్బంది వివరాలను ఏఎస్పీ చైతన్యరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య ఉన్నారు.
Advertisement