- అక్షరటుడే, వెబ్డెస్క్: Assembly |మాజీ మంత్రి, నర్సాపూర్(Narsapoor) ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Laxmareddy)పై స్పీకర్(Speaker) ప్రసాద్కుమార్ (Prasad Kumar) వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీంతో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.
సోమవారం అసెంబ్లీ(Assembly)లో సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. అనంతరం తనకు వినబుద్ధి కావడం లేదని, మిగతా వారు ఎలా వింటున్నారో అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్(BRS) నేతలు అభ్యంతరం చెప్పారు. ఓ మహిళను అవమానపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు.
స్పీకర్(Speaker) మంగళవారం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి(MLA Sunitha Lakshma Reddy)ని ఉద్దేశించి అలా అనలేదని చెప్పారు. ఇతర సభ్యులు గొడవ చేస్తుండటంతో అన్నానని తెలిపారు. తనకు మహిళలు అంటే ఎంతో గౌరవం అని చెప్పారు. తన వ్యాఖ్యలు ఆమెను బాధ పెట్టుంటే వెనక్కి తీసుకుంటానని స్పీకర్ తెలిపారు.