అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad DPO | నిజామాబాద్ డీపీవోగా డి.శ్రీనివాస్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి నుంచి ఆయన ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా డీపీవోను సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బోధన్ డివిజినల్ పంచాయతీ అధికారిగా ఎస్.నాగరాజు బాధ్యతలు చేపట్టారు.
కాగా.. నిజామాబాద్ డీపీవో పోస్టు కొద్ది రోజులుగా ఖాళీగా ఉంది. తాజాగా పంచాయతీరాజ్ శాఖ శ్రీనివాస్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల (సర్పంచ్) ఎన్నికలు జరిపేందుకు సర్కారు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఈ పోస్టును భర్తీ చేసినట్లు సమాచారం.