అక్షరటుడే, బోధన్: సాలూర ఎంపీడీవోగా శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన మండల కేంద్రంగా ఏర్పాటైన సాలూరకు ఇన్చార్జి ఎంపీడీవోగా రెంజల్ ఎంపీడీవో ఆఫీస్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ను ఇటీవల ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Advertisement
Advertisement