అక్షరటుడే, నిజాంసాగర్: మండలంలోని అచ్చంపేట్ మోడల్ స్కూల్ను సబ్ కలెక్టర్ కిరణ్మయి గురువారం తనిఖీ చేశారు. మోడల్స్కూల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటగది లేక ఇబ్బందులు పడుతున్నామని, గదిని మంజూరు చేయించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెను కోరారు. అనంతరం విద్యార్థులకు ఆమె స్నాక్స్ అందజేశారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా చదవాలని సూచించారు. ఆమె వెంట తహశీల్దార్ భిక్షపతి, ఎంఈవో తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ కార్తీక సంధ్య తదితరులున్నారు.